- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
వాస్తు మూల పురుషులు, మహర్షులు
మనకు యెన్నో శాస్త్రాలు విజ్ఞాన విషయాలను తెలియజేస్తూ వుండటం వల్లనే మానవ జీవితం లో నాగరికతాభివృద్ది జరుగుతుంది.అలాగే గృహ నిర్మాణం లో కూడా అలాంటి శాస్త్రీయమైన విజ్ఞాన విషయాలను తెలియపరిచిన మహానుభావులనూ స్మరించుకోవడం మన భాధ్యత...
వారు బృగువు మహర్షి, వశిష్ట మహర్షి, నారధుడు, విశ్వకర్మ, నగ్న జిత్తు, విశాలాక్షుడు, పురందరుడు, బ్రహ్మ, నందిశ్వరుడు, శౌనకుడు, గార్గుడు, వసుదేవుడు, శుక్రుడు, బృహస్పతి.
అత్రి మహర్షి, మయుడు,కుమారుడు, మరియు అనిరుద్ధుడు అను అష్ట దశ మహర్షులతో పాటుగా
అగస్తుడు, తిమల్యోక్యుడు, కాశ్యపుడు, కాత్యయ్యనుడు, మారిచి, చిత్రతోయకుడు, పుండరీకుడు, దీర్ఘదర్శి, పునర్వసు, యోగసారుడు, చౌనుడు, ఇంకా కొందరు వాస్తు శాస్త్రాలను, మూల గ్రంథాలను, గ్రంథాలను రచించినట్లు, మనందరికి తెలుసు.
పురాతన వాస్తు శాస్త్రం ప్రకారం గృహాన్ని నిర్మించాలని అని అనుకుంటే , క్రిందా ఉన్నా లింక్ నీ క్లిక్ చేయండి.....
https://www.youtube.com/c/meenavaastu?sub_confirmation
యుగాలు, యుగ ధర్మాలు, కాలాలు, కాల ధర్మాలు, శాస్త్రాలు , శాస్త్ర ధర్మాలు, మార్పు చెందుతున్నాయి. మార్పు చెందడం అనేదే ప్రకృతి యొక్క సహజ ధర్మం.
ప్రకృతి రహస్యాలను కనిపెట్టిన మానవుడు ఆ జ్ఞాన సంపదను ఒక తరం నుండి ఇంకొక తరానికి ఒక విజ్ఞానంగా, ఆవిష్కరించి ,తయారుచేసి గ్రంథాలు గా రాసి వాటిని అందించారు.
వాస్తు శాస్త్రములో ఉన్న ఈ గ్రంథాలు మాయ మతము, మానసారము, బృహత్ సంహితలు, శిల్పరత్నం, శుక్రనీతి అనునవి అతి పురాతన ప్రాచీన కాలములో రచించబడ్డాయి. ఆ తర్వత కాలములో అపరాజిత పృచ్ఛ, విశ్వకర్మ వాస్తు శాస్త్రము, మండవ సూత్రధారము, దీపార్ణవము, సమరాంగణ సూత్రధారము, శిల్పకళ దీపిక, మరియు రాజసింహ వాస్తు మొదలయినవి.
ఆ తర్వత కాలములో మనుష్యలయ చంద్రికా,వాస్తు విద్య,వాస్తు పురుష మండలం,మరియు ఆయాది గణనా యెన్నో గ్రంథాలు రచించబడినవి.
పురాణాలలో కూడా వాస్తు శాస్త్రాన్ని పొందుపరచడం జరిగింది, గరుడ పురాణం, మత్స్య పురాణం, మరియు అగ్ని పురాణం, ఉప నిషత్తులలో కూడా వాస్తు సూత్ర రహస్యాలను పొందుపరచడం జరిగింది.
Click the below link for more information
వాస్తు శాస్త్రం, ఆది మానవుని కాలం నుండి ఒక ఆచారంగా, పరంపరగా వస్తున్నదే కానీ , ఈ మధ్య కలియుగం లో, ప్రత్యేకముగా 1980 నుండి వాస్తు శాస్త్రం తమ నుండి ఉద్భవించింది, తామే వాస్తు శాస్త్రం మొదటగా కనిపెట్టినట్లుగా ప్రగల్భాలు చెప్పుకొంటున్నారు.
ఒక ఉదాహరణగా ---ఆ, ఆ, ఈ, ఈ లు నేర్పించే ఉపాధ్యాయుడు, ఆ, ఆ, ఈ, ఈ, వర్ణమాల మొత్తం తనవే అన్నట్లుగా ఉంటుంది, ఈ మనోబావనా ,వారి వరసగా మారిపోయింది.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment